ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి పై కొనసాగుతున్న పోరులో తమవంతు పాత్ర పోషిస్తున్నారు మద్నూర్ మండలానికి చెందిన ఎంపీటీసీ రచ్చ సంగీత కుషాల్. ఓ వైపు ప్రజా ప్రతినిధి గా బాధ్యతలు నిర్వహిస్తూ తానే స్వయంగా కాటన్ బట్టతో మాస్కూలు తయారు చేసి మద్నూర్ మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు గ్రామ సర్పంచ్ సురేష్ తో కలసి 500 మాస్కూలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దర్ కీష్ట నాయక్, నాయకులు రచ్చ కుషాల్ కుమార్ లు వున్నారు. దీంతో మండల ప్రజాప్రతినిధులు ప్రజలు ఉపాధి కూలీలు ఆమె సేవ పట్ల అభినందిస్తున్నారు.
previous post