సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సిబ్బందికి మినిమమ్ స్కేల్ ఇచ్చినందుకు సీఎం జగన్, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి లకు కడపజిల్లా రాయచోటి ప్రాంతసమగ్ర శిక్ష ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా, లక్కిరెడ్డిపల్లి మాజీ జడ్పీటీసీ మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, వై ఎస్ ఆర్ సిపి నాయకులు హాబీబుల్లా ఖాన్, పి ఆర్ టీ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రాజు, ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహా రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టు లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు MTS అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 40 విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వై.ఎస్.ఆర్ ఐ.ఈ.ఆర్.టి.సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లో వై ఎస్ ఆర్ ఐ ఆర్ టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ బాబు, జనార్ధన్ సి ఆర్ పి లు అరుణ్ బాబు , రవి ప్రకాష్ ,శ్రీ రాములు, ఈశ్వరమ్మ , ముబారక్ , ఫర్హానా కంప్యూటర్ ఆపరేటర్ మహేష్ ఆచారి పార్ట్ టైం టీచర్స్ నీలిమ ,రమాదేవి తదితరులు పాల్గొన్నారు.