ప్రముఖ సినీ నటి సమంత కాలినడకన నేడు తిరుమల ఏడు కొండలు ఏక్కారు. ఆమె తన స్నేహితురాలు రమ్యా సుబ్రమణియన్తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలి నడన ఏడుకొండలు ఎక్కి శ్రీనివాసుడి దర్శనం చేసుకున్న ఫోటోలను రమ్యా సుబ్రమణియన్ తన ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేశారు.
తిరుపతి దర్శనం ఎంతో అద్భుతం. 2019కి మంచి వీడ్కోలు.. అదే విధంగా 2020కి శుభారంభం. ఇందుకు వెంకటేశ్వరుడికి.. అదే విధంగా నా తిరుపతి పార్ట్నర్ సమంతకు ధన్యవాదాలు’ ఆంటూ క్యాప్షన్ పెట్టారు. ఇక యాంకర్ గా తన కేరియర్ ని మొదలుపెట్టిన రమ్యా సుబ్రమణియన్ ఇప్పుడు సినిమాలతో బిజీ అయ్యారు.