హీరోయిన్ సమంత తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పారెడ్డి తో కలిసి డెహ్రాడూన్ లో పర్యటించింది. శిల్ప ఫ్యామిలీతో వారం పాటు సరదాగా గడిపిన సమంత ఆ వివరాలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసింది. త్వరలోనే కొత్త సినిమాల షూటింగులలో బిజీ కానున్నందున ఆ లోపున ఖాళీ సమయాన్ని తన సన్నిహితులతో కలిసి ఆమె గడుపుతోంది. అందులో భాగంగానే డిజైనర్ శిల్పారెడ్డి, ఆమె ఫ్యామిలీతో సరదాగా గడిపింది.
నిన్న సాయంత్రం డెహ్రాడూన్ టూర్ కు వెళ్లింది. ఆ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అందం, సరదా, ఆనంద క్షణాల ఈ వారం ఎంతో వేగంగా గడిచిపోయిందంటూ పోస్ట్ పెట్టింది. ఫ్లైట్ లో దిగిన ఫొటోలను, డెహ్రాడూన్ లో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.