హైదరాబాద్ శేరిలింగంపల్లి ప్రాంతంలోని పాపిరెడ్డి నగర్ లో వెలిసిన సమ్మక్క-సారలమ్మల ఆలయ నిర్వహణకు మారబోయిన రవి కుమార్ యాదవ్ నేడు భారీ విరాళం అందచేశారు. ఆలయంలో సమ్మక్క సారలమ్మల జాతర నిర్వహణను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ కోరారు. ఈ సందర్భంగా జాతరకు కమిటీ తరఫున రవి కుమార్ యాదవ్ ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ ఏసి రెడ్డి భూపాల్ రెడ్డి, అధ్యక్షులు బాలు యాదవ్, వైస్ చైర్మన్ లు శ్రీధర్ పటేల్, గంగుల రాజిరెడ్డి, ముఖ్య సలహాదారులు ప్రకాశ్ రావు, ఉపేందర్, ఓ నర్సింగరావు, జనరల్ సెక్రటరీ రాజా మీ స, సాయి కుమార్, బాలు, క్యాషియర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
previous post