తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిటీ సభ్యుడు గా కట్టా సంపత్ కుమార్ నియమితులయ్యారు. జాతీయ మాన హక్కుల పరిరక్షణ సిఫార్సు మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిటీ అధ్యక్షురాలు డాక్టర్ ఆర్.వి.లక్ష్మి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శ్రీనివాస పురం గ్రామానికి చెందిన కట్టా సంపత్ కుమార్ ను తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల పరి రక్షణ కమిటీ సభ్యుడు గా నియమించారు.
ఈ సందర్భంగా కట్టా సంపత్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మానవ హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిటీ సభ్యుడు గా నియమించినందుకు రాష్ట్ర అ్యక్షురాలు డాక్టర్ ఆర్.వి.లక్ష్మి కి కృతజ్ఞతలు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా పని చేస్తానని,ప్రస్తుత పరిస్థితుల్లో మానవ హక్కుల పరిరక్షణ అనేది చాలా ముఖ్యమని అన్నారు.ఐసీసీ ఒకటి నుండి ముప్పది వరకు ఎటువంటి సమస్యలు ఉన్నా మానవ హక్కుల పరిరక్షణ కమిటీని సంప్రదించాలని తెలిపారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్