కడప జిల్లా రాజంపేట, పెనగలూరు మండలాల్లో నిబంధనలకు వ్యతిరేకం గా ఇసుక తరలిస్తున్న 16 ఇసుక ఎద్దుల బండ్ల ను పోలీసుల స్టేషన్ కి తరలించారు.
నూతన నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ఈ ఎద్దుల బండ్ల ను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.
అదుపులోకి తీసుకున్న బండ్లను రాజంపేట రూరల్ పోలీస్ స్టేషన్లో 6,పెనగలూరు పోలీస్ స్టేషన్లో 10 అప్పగించారు. కేసులు నమోదు చేశారు.
అక్రమార్గంలో భారీ వాహనాలలో ఇసుక క్వారీ ల నుంచి ఇసుక తరలిపోతున్నా చూసి, చూడనట్టు ఉన్న అధికారులు, రెక్కాడితే డొక్కాడని పేద ఎద్దుల బండ్ల పై జులుం చూపడంతో వాటి యజమానులు లబోదిబోమంటున్నారు.
బండి ఇసుక కోసం తాసీల్ధార్ అనుమతి లేదా సచివాలయ కార్యదర్శి అనుమతి తీసుకోవాలాని కోరడం వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది.