సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సీఎం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు చివరి రోజు కావడంతో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ అభినవ అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని చూడలేదు.. సీఎం కేసీఆర్ రూపంలో ఇప్పుడు చూస్తున్నాం…అని ఆయన అన్నారు. ఆనాడు అంబేద్కర్ అట్టడుగు వర్ణాల అభ్యున్నతి కోసం అన్ని అంశాలు పొందుపరిచి రాజ్యాంగాన్ని నిర్మించారని, అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ అట్టడుగు వర్ణాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు పొందుపరిచారని ఆయన తెలిపారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించడం పై సంతోషంగా ఉంది.. దేశ చరిత్రలో ఒక సంచలమైన నిర్ణయం.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం…అని కలెక్టర్ శరత్ అన్నారు. భూమి లేని గిరిజనులకు గిరిజన బంధు ఇస్తామని సంచాలమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. గిరిజనుల పట్ల సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు అని శరత్ తెలిపారు.
previous post