రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు ప్రత్యక్ష తరగతులు పున:ప్రారంభించనున్న నేపధ్యంలో మంగళవారం స్థానిక ఎమ్ఎల్సి కాటేపల్లి జనార్ధన్రెడ్డి మల్లాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా స్థానిక కార్పోరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి తో సమావేశమై పాఠశాల మౌలిక వసతులు, తరగతి గదుల శానిటేషన్, పాఠశాల ప్రాంగణంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
తదితర పనులను జిహెచ్ఎమ్సి అధికారుల ద్వారా త్వరితగతిన పూర్తిచేయాలని కార్పోరేటర్కు ఆదేశించారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు గీతా శ్యామల , మహేశ్, వెంకటనర్సయ్య, పద్మావతి స్థానికులు పిఆర్ ప్రవీణ్, రఘు తదితరలు పాల్గొన్నారు.