నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని దేవాలయ పారిశుద్ధ్య కార్మికులకు ఆర్యవైశ్య ఉద్యోగులు వృత్తి పని వారి సంఘం( అవోపా) ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు స్థానిక దేవాలయాలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో 25 మంది కార్మికులకు పప్పు బియ్యం నూనె మొదలగు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు అవోపా పట్టణ అధ్యక్షులు కృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో బి వెంకటేశ్వర్లు పాలుట్ల జంగయ్య పోలా మురళీధర్ పోలా నరసింహయ్య సంబు ప్రభాకర్ విజయ భాస్కర్ నర్సింహయ్య గౌరయ్య నర్సింలు గుప్తా లింగయ్య వెంకటరమణ వెంకట్ స్వామి రవి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు