సీజనల్ వ్యాధుల నివారణే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు ఉదయం 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నాక డివిజన్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గల మొక్కల తొట్టిల్లో ఉన్న నిల్వ నీటిని తొలగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ ఇళ్లను, ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని, నిల్వ ఉన్న నీటిని తొలగించాలని తద్వారా దోమలను నివారించి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సురక్షితంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీసీ వేణుగోపాల్, ఏంట్మాలాజీ ఏఈ అంబిక, ఫీల్డ్ ఆస్సీటెంట్ వెంకటయ్య, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట