కరోనా వేళ…ఆది శంకరుల జయంతి ఉత్సవం…. ఏపీలో స్వామి శ్రీ రామానంద యోగజ్ఞాన ఆశ్రమ పీఠాధిపతి, రిటైర్డ్ ఆర్జేడీ డా.వీ.వెంకటేశ్వరరావు(శ్రీగురూజీ) ఆశీస్సులతో నిత్య పూజ జరుగుతున్న ధ్యానమందిరంలో ఆది శంకరుల జయంతి ఉత్సవం జరిగింది.
శంకరుల జయం. ఈ సందర్భంగా సద్గురు పూజ, శంకరుల సహస్రం ,శ్రీగురుగీత ,శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం,శ్రీ సద్గురు పాదుకాస్తవమ్..పఠనం మరియు సహస్ర బిళ్వదళాలతో పూర్తయ్యింది.
అలాగే అపర వాల్మీకి సద్గురు స్వామి శ్రీ శివానంద పరమ హంస ప్రియ శిష్యులు, మౌన స్వామి శ్రీ రామానంద పరమహంసల వారు స్థాపించిన యోగజ్ఞాన ఆశ్రమంలో కూడా ఆశ్రమ పీఠాధిపతి శ్రీ గురూజీ చేతుల మీదుగా శంకర జయంతి జరిగింది.