సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రామంతపూర్ కామాక్షి పురం కమ్యూనిటీ భవనం గ్రౌండ్ లో ముగ్గులపోటిలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం రామంతపూర్ మాజీ కార్పొరేటర్ & స్టాండింగ్ కమిట్టి మెంబర్ గంథం జొత్స్నా నాగేశ్వరావు అద్వర్యం లో జరిగిన సంక్రాంతి పండగ సందర్బంగా ముగ్గులపోటీని వైభవంగా నిర్వహించారు. ఈ పోటిలో పాల్గొన్న మహిళలు రంగురంగులు ముగ్గులు వేసి చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలకు ప్రథమ,ద్వితీయ,తృతీయ,కన్సో లేషన్ ప్రైజ్ లు మహిళలందరికీ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం లో మద్దూరి శ్రీనివాస్,రాధమ్మ ,జానకమ్మ ,సరిత,దినేష్,ఉదయ్,శివ,ఖదీర్,మధు, కమిట్టి సభ్యులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి