27.7 C
Hyderabad
April 24, 2024 08: 14 AM
Slider ఆధ్యాత్మికం

అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి శాంతి కళ్యాణం

#santikalyanam

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం మట్టపల్లి మహా క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనృసింహ స్వామి పవిత్రోత్సవాలలో భాగంగా సోమవారం మూడవ రోజు పవిత్ర విసర్జనోత్సవం,పూర్ణాహుతి,సప్తదశ కుమారోహణము,శాంతి కల్యాణ మహోత్సవము ఆగమ శాస్త్రం అనుసారంగా అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది.

అనంతరం ఆచార్య సన్మానం గావించారు.యాజ్ఞీక నిర్వాహ,ఆగమ ప్రవర బుర్రా వాసుదేవాచార్యులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పవిత్ర బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామి వారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు,చెన్నూరు విజయ్ కుమార్, కార్యనిర్వహణాధికారి సిరికొండ నవీన్, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ప్రముఖ నటి త్రిషకు కరోనా పాజిటివ్..!

Satyam NEWS

స్వార్ధ రాజకీయాలు పోవాలి: బీజేపీ మళ్లీ రావాలి

Satyam NEWS

కస్తూరిబా కళాశాలల సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం

Satyam NEWS

Leave a Comment