ఎంతో ప్రసిద్ధి చెందిన ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు కోటి వరాల తల్లి, భక్తులు పాలిట కల్ప వల్లి శ్రీకాకుళం శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానములో శుక్రవారం సప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారికి తెల్లవారు జామున సుప్రభాత సేవ, మహాక్షిరాభిషేకం సేవ, నిత్య పూజలు, సహస్త్రనామార్చనా పూజ సేవ, పుష్ప అలంకరణ సేవ కుంకుమ పూజ , శ్రీ లలిత సహస్రనామ పారాయణం, లక్ష కుంకుమార్చన పూజ మహానివేదన మహా హారతి వేద ఆశీర్వచనము వేద పారాయణం నిర్వహించారు.
ఈ కార్యక్రమాలకు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ నేతృత్వం వహించారు.
ఉదయం నుండి భక్తులు కుంకుమ పూజలతో బాటు ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు మాస్క్ ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఉద్యాపనలు జరిపించుకున్నారని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి వాకచర్ల రాధాకృష్ణ తెలిపారు.