విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర స్వామి జన్మదినం సందర్భంగా విజయనగరం జిల్లా బ్రాహ్మణ సమాఖ్య పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించింది.
రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరంలోని ప్రేమ సమాజంలో వృధ్ధులకు పండ్ల పంపిణీ తో పాటు అక్కడ ఉంటున్న 150 మందికి భోజనం పెట్టారు.
ఈ సందర్భంగా జిల్లా బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు కేపీ ఈశ్వర్ మాట్లాడుతూ సర్వేజనా సుఖినో భవంతు అన్న నినాదంతో మనమంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు అందరూ పాల్గొన్నారు.