దళిత, బహుజన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371 వ జయంతి సందర్భంగా చిక్కడపల్లి లో తెలంగాణ రాష్ట్ర కల్లు గీత సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహనికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళిత, బడుగు బలహీన వర్గాల నాయకుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సబ్బండ వర్గాల ప్రజలకు పండుగ రోజు అన్నారు. అన్ని కులాలను, మతాలను ఏకం చేసి ఆనాటి పాలకుల అరాచకాలపై తిరుగుబాటు చేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అభివర్ణించారు.
శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారన్నారు. తాటి, ఈత చెట్ల పన్నులను రద్దు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రోత్సహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దన్నారు. గౌడ వృత్తిదారులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్లు గీత సంఘాల సమన్వయ సమితి చైర్మన్ బాలగొని బాలరాజు గౌడ్, వర్కింగ్ వైస్ చైర్మన్ యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్, కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, గీత కార్మికుల సంఘం అధ్యక్షుడు రమణ గౌడ్, రాష్ట్ర ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, బాలగోని వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.