పాలకుల,అణచివేత దోపిడీ లపై మామూలు మధ్య తరగతి ప్రజలు కూడా తిరుగుబాటు చేసి రాజ్యాధికారం చేజిక్కుంచు కోవడానికి సర్దార్ సర్వాయి పాపన్న అందరికీ స్ఫూర్తి అని దుబ్బాక గీతా పారిశ్రామిక సంఘం అధ్యక్షులు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్ అన్నారు.
దుబ్బాక గీతా పారిశ్రామిక సహకార సంఘంలో సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలేష్ గౌడ్ మాట్లాడుతూ మొగలాయి పాలకుల అరాచకాలు, దోపిడీ లపై ప్రజలంతా నానా అవస్థలు పడుతున్న సమయంలో ఒక మామూలు మధ్యతరగతి కులవృత్తి చేసుకునే యువకుడు వారిపై తిరుగుబాటు చేసి, ప్రజలందరిని ఐకమత్యం చేసి రాజ్యాధికారం చేజిక్కించుకొనే వరకు పోరాటం చేసి గోల్కొండ రాజ్యాన్ని ఏలిన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న దని అన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్పూర్తితో బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారాన్ని చేపట్టేందుకు ప్రజలను చైతన్యం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు దుర్గేన్దర్ గౌడ్, పల్లె శ్రీనివాస్ గౌడ్, రామస్వామి గౌడ్, వెంకట్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, వంశీకృష్ణ గౌడ్, వై.శ్రీనివాస్ గౌడ్, పిబి శ్రీనివాస్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.