27.7 C
Hyderabad
April 26, 2024 04: 40 AM
Slider జాతీయం

యుకే ప్రతిష్టాత్మక ఫెలోషిప్ కు ఎంపికైన సతీష్ రెడ్డి

sateesh reddy

యునైటెడ్ కింగ్​డమ్​కు చెందిన రాయల్ ఏరోనాటికల్ సొసైటీ అందించే ప్రతిష్టాత్మక ఫెలోషిప్​కు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీఓ) ఛైర్మన్​ జి. సతీష్ రెడ్డి ఎంపికయ్యారు. క్షిపణి సాంకేతికతలను స్వదేశంలో అభివృద్ధి చేయడానికి సతీష్​ రెడ్డి చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఫెలోషిప్​ అందిస్తున్నట్లు సొసైటీ పేర్కొంది. వైవిధ్యభరితమైన క్షిపణి వ్యవస్థలు, ఏరోస్పేస్ వాహనాలు, గైడెడ్ ఆయుధాలు, విమానయాన సాంకేతికతలను అభివృద్ధి, రూపకల్పనలలో సతీష్​ రెడ్డి అందించిన సేవలను ప్రస్తావిస్తూ ప్రకటన విడుదల చేసింది రాయల్ ఏరోనాటికల్ సొసైటీ. గత వందేళ్ల అవార్డు చరిత్రలో సతీష్ రెడ్డి భారత్​ నుంచి ఎంపికైన తొలి వ్యక్తి కావడం విశేషం.

Related posts

హార్స్లీ హిల్స్ భూములు అప్పనంగా రాయిస్తే ప్రజలు బుద్ధి చెబుతారు

Satyam NEWS

రేపు హుజూర్ నగర్ కు రానున్న వైఎస్ షర్మిల

Satyam NEWS

సందీప్ మాధ‌వ్ హీరోగా స‌రికొత్త రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌

Satyam NEWS

Leave a Comment