Slider ప్రత్యేకం

జగన్ పాకుడు యాత్రపై సెటైర్లు

#jagan

దేశం మొత్తం ఒక మూడ్‌లో ఉంటే మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్ మ‌రో మూడ్‌లో ఉన్నారు. ఆయ‌న‌కు అర్జంట్‌గా ముఖ్య‌మంత్రి సీటు ద‌క్కాలి. దాని కోసం ఏమి చేయాలో ఎలా చేయాలో అనేదానిపైనే 24గంట‌లూ మ‌ధ‌న‌ప‌డుతున్న‌ట్లున్నారు. పిల్లాడు చాక్లెట్ కోసం ఏడ్చిన‌ట్లు జ‌గ‌న్ సిఎం సీటు కోసం గుక్క‌ప‌ట్టి ఏడుస్తున్నాడు. త‌న సిఎం సీటును చంద్ర‌బాబు ఎత్తుకుపోయాడు, త‌న సీటు త‌న‌కు ఇప్పించాలనే విధంగా ఆయ‌న చేస్తోన్న వ్యాఖ్య‌లపై సోష‌ల్ మీడియాలో హాస్యోక్తులు ప్ర‌త్య‌క్షం అవుతున్నాయి.

నిన్న‌ కాక మొన్న‌నే క‌దా ఎన్నిక‌ల‌యి పోయింది, మ‌రి అప్పుడే రేపో, ఎల్లుండో మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌న్న‌ట్లు జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తా, పాకుడుయాత్ర చేస్తా అంటూ చేస్తోన్న వ్యాఖ్య‌లు స్వంత పార్టీ వారికే ఇర‌క్తి క‌ల్గిస్తున్నాయి. ఐదేళ్ల‌కు ఎన్నుకోబ‌డిన ప్ర‌భుత్వానికి ఇంకా ఏడాది కూడా పూర్తి కాకుండానే, వాళ్లంతా విఫ‌లం అయ్యారు. ఇక త‌న‌నే ప్ర‌జ‌లు సిఎంగా ఎన్నుకుంటార‌ని, వీలైతే రేపే సీటు మీద కూర్చోబెడ‌తార‌ని, ఆయ‌న చేస్తోన్న ప్ర‌క‌ట‌న‌లు పార్టీ నేత‌ల‌కు చిరాకు పుట్టిస్తున్నాయి.

మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఘోరాతిఘోరంగా ప్ర‌జ‌లు ఓడించినా, ఎందుకు త‌న‌ను ఓడించార‌నే దానిపై క‌నీస స‌మీక్ష చేసుకోకుండా ఓట‌మిని ఈవిఎంల మీద‌కు నెట్టేసి ద‌ర్జాగా బెంగుళూరు-విజ‌య‌వాడ మ‌ధ్య తిరుగుతూ అప్ప‌డ‌ప్పుడూ ప‌రామ‌ర్శ యాత్ర‌లు చేస్తోన్న ఆయ‌న తీరును పార్టీలో ఇంగితం ఉన్న‌వారు ప‌రోక్షంగా ఖండిస్తున్నారు. ఆయ‌న మార‌డు..ఆయ‌న‌కు కావ‌ల్సింది ప్ర‌జ‌ల సంక్షేమం కాదు..త‌న ఆస్తుల పెంపు..సిఎం సీటు..బ‌ట‌న్ నొక్కుడు..ఇవే ఆయ‌నకు ప్ర‌ధానంగా కావాల్సింది.

ఎంత సేపూ త‌న‌కు సిఎం సీటు ఎప్పుడు దొరుకుతుందా…? అనే ఆస‌క్తే త‌ప్ప‌..ప్ర‌జ‌ల‌కు మేలు చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల‌నే ఇంగితం ఆయ‌న‌కు ఇంతైనా లేద‌ని వారు ఆక్షేపిస్తున్నారు. ఒక‌సారి చూద్దామ‌ని ప్ర‌జ‌లు ఓటు వేస్తే..అదేదో త‌న ప్ర‌తిభ అన్న‌ట్లు..రెచ్చిపోయి..అన్నివ‌ర్గాల‌ను నానా ఇబ్బందుల‌కు గురిచేసి..అగ‌చాట్లు పెట్టిన విష‌యాన్ని ఆయ‌న మ‌రిచిపోయినంత తొంద‌ర‌గా ప్ర‌జ‌లు మ‌రిచిపోతారా..? 

వందేళ్ల‌కు స‌రిప‌డా పాపాల లెక్క అప్పుడే తేలుతుందా..?  ప్ర‌జ‌లు అమాయ‌కులు..అనాధ‌లు..చిల్ల‌ర‌కు ఆశ‌ప‌డేవాళ్లు అన్న ఆయ‌న దృక్ప‌థంలో ఇంతైనా మార్పురాలేద‌ని..తాను ఏమి చెప్పినా వినే గొర్రెలు ఉన్నాయ‌న్న ధైర్యంతో..ఆయ‌న చేస్తోన్న ప్ర‌గ‌ల్భాలు..ఎందుకూ ప‌నికిరావ‌ని ఆయ‌న తెలుసుకోలేక‌పోతున్నార‌ని కూడా ఆ పార్టీ నాయ‌కులు ప‌రోక్ష చ‌ర్చ‌ల్లో చెబుతున్నారు. అప్ప‌ట్లో 175కు 175 అంటే అమాయ‌కంగా న‌మ్మామ‌ని…ఈసారి టిడిపికి సింగిల్‌డిజిట్ అంటూ..ఆయ‌న క‌ల‌ల్లో విహ‌రిస్తున్నార‌ని ఇవ‌న్నీ..అయ్యే వ్య‌వ‌హారాలు కావ‌ని వారు ఎద్దేవా చేస్తున్నారు.

తాను రోడ్డు మీద‌కు వ‌స్తే..వేలాది మంది వ‌స్తార‌ని, త‌ద్వారా..త‌న బ‌లం చూపించుకుని మ‌రోసారి అధికార‌సోపానానికి ఎగ‌బాకాల‌ని ఆయ‌న క‌ల‌లు కంటున్నారు. అయితే.. ప్ర‌జ‌లు ఒక‌సారి మాత్ర‌మే న‌మ్ముతారు..మాటి మాటికి న‌మ్మ‌డానికి వాళ్లు వెర్రివాళ్లు కాదు.  నాలుగేళ్ల స‌మ‌యం ఉన్న ప‌రిస్థితుల్లో ఎవ‌రైనా ఏమి చేస్తారు..పార్టిని కాపాడుకుంటూ..ప‌టిష్ట‌ప‌రుచుకుంటారు..

కానీ..ఈయ‌న మాత్రం క‌ల‌ల్లోనే విహ‌రిస్తున్నార‌నే భావ‌న వారు వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తం మీద‌…జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌లపై స్వంత పార్టీలోనే అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది.  

Related posts

నరసరావుపేట నియోజకవర్గంలో బరితెగించిన నాయకులు

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: సౌమ్యనాథ స్వామి దేవాలయం మూసివేత

Satyam NEWS

సార్వజనిక్ గణేష్ మాత్రమే ప్రతిష్టిద్దాం

Satyam NEWS
error: Content is protected !!