సత్య నాదెండ్ల మైక్రోసాఫ్ట్ చైర్మన్ అయారు. ఇప్పటి వరకూ చైర్మన్ గా ఉన్న జాన్ థాప్స్ న్ స్వతంత్ర డైరెక్టర్ గా కొనసాగుతారు.
2014లో స్టీవ్ బ్లామెర్ తర్వాత సీఈవోగా వచ్చిన సత్య నాదెండ్ల మైక్రో సాఫ్ట్ బిజినెస్ ను గణనీయంగా పెంచారు.
లింక్ డిన్, న్యూన్సీ కమ్యూనికేషన్స్, జెనీ మాక్స్ లాంటి కంపెనీలను కొనుగోలు చేయడంలో సత్యనాదెండ్ల కీలక పాత్ర పోషించారు.
మైక్రోస్టాఫ్ట్ నుంచి బిల్ గేట్స్ వైదొలగిన అనంతరం బోర్డులోకి కొత్త వారు వచ్చారు. ఆ సమయంలో సత్య నాదెండ్ల తనదైన శైలిలో కంపెనీ పురోగతికి పాటుపడ్డారు.
ఇప్పుడు ఆయన మైక్రోసాఫ్ట్ చైర్మన్ అయ్యారు.