వరంగల్లు జిల్లా నర్సంపేట మండలాన
లక్నేపల్లిలో జన్మించి చరిత్రలో
తెలంగాణ కీర్తి నిలిపినావు
భరత దేశమందు తెలుగు వెలుగులు నింపి
తెలుగువారి ఘనత పెంచినావు
రుక్నాబాయి సీతారామారావు యింటి బిడ్డడివై
రంగారావు రుక్మిణమ్మ వొడిలో
గారాల తనయుడివై పెరిగినావు
పలు భాషా రచనలను అనువాదములు చేసి
ప్రాంతీయ భేదాన్ని పారద్రోలినావు
పదిఏడు భాషలను అవలీలగా నేర్చి
బహుభాషా కోవిదుడవై వెలిగొందినావు
వేయి పడగల కావ్యము హిందీకి మార్చి
కేంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొంది
తెలుగుకు యెనలేని గౌరవం దక్కించినావు
విద్యార్ధి దశలోనె ఒక్కడిగ అడుగేసి
నిజాము రాజును యెదిరించినావు
ధైర్యవంతముగ దేశభక్తిని చాటి
వందేమాతర గీతము ఆలపించినావు
హైదరాబాద్ విముక్తి పోరాటముచేసి,
స్వాతంత్రోధ్యమం జేయ నాయకులతో కలిసి
ఉద్యమాన్ని ముందుకు నడిపించినావు
ముఖ్యమంత్రిగ సేవలందించి ప్రధానమంత్రిగా యెదిగి
తెలుగునేల ఘనత చాటినావు
శాంతి మార్గమున పనులు చక్కదిద్ది
అపర చాణిక్యుడిని మరిపించినావు
సామరస్యముతోను దేశాన్ని నడిపించి
పాలనలో వడిదుడుకులను తప్పించి
భరతమాత మెప్పు పొందినావు
జయ అను పేరుతో కాకతీయ పత్రిక ను నడిపి
సాహిత్య రంగములో కృషిచేసినావు
యుక్తితో గెలిచి శాంతిని నెలకొల్పి
రాజనీతితోను ఎత్తుగడలువేసీ మెలుకువలతో
పాలించి ప్రజల మనసును దోచినావు
ఇన్ సైడర్ ఆత్మకథ లో లోపలిమనిషిని చూపించి
మౌనముగానే మనుషుల గెలిచినావు
పాములపర్తి వేంకట నరసింహారావుగా వెలిగి
పి.వి నరసింహారావు గా చిరకాలం వర్ధిల్లినావు
గంజి కళావతి శ్రీనివాస్, నల్లగొండ, సెల్: 9912589703.