వంగర కూ వరంగల్లు కు ముద్దుబిడ్డ పీవీ
వసుధలోనె నిలబెట్టెను మన తెలుగు ఠీవీ.
నాటి నిజాం బూజుదులుప నడుంకట్టినాడు
సాటి ఛాత్రమిత్రులతో సమరం చేసినాడు.
రామానంద, బూర్గులకూ ప్రేమ పాత్రుడాయె
రగిలించెను విప్లవాగ్ని రణశంఖంబూదె
బహిష్కృతుడు నాడు పీవీ నైజాం సరిహద్దు
పరిష్కారమిచ్చె నాగపురము చదువు ముద్దు
కాకతీయ పత్రికతో కలిసె సదాశివరావు
కాకలు దీరిన రచనల కలంతో నరసింహరావు
రాజకీయ రంగంలో రాణించిన యుక్తిపరుడు,
వరించు పదవీకన్నెల సరసన కుదురుకున్న వరుడు
బహుభాషా కోవిదుడై భాసిల్లె విరాన్మూర్తి
నీతినిలువుటద్దంబై నిలుచు నిత్య విద్యార్థి
భూమిపంచి,విద్యబెంచి భవితకు మార్గమ్ములేసె
దిగజారిన ఆర్థిక స్థితి దిశను మార్చి దీప్తి జేసె
స్వపక్ష ప్రతిపక్షాల్లో సురక్షుడై నిల్చెను
తన మౌనమే ప్రజాయుధమై మహరాజుగ నిల్పెను
దక్షిణదిశ నుండి వచ్చి దశమార్చెను దేశానికి
‘ భారత రత్నం’ బీయుటే భావ్యం తెలుగు తేజానికి.
డా. పల్లేరు వీరాస్వామి, 9441602605