లక్నేపల్లిలో పుట్టి
పాముల పర్తి వంశాంకురమై నిలిచి
తెలంగాణ ముద్దుబిడ్డగా ఒదిగి
భారతదేశ ప్రధానిగా ఎదిగి
అత్యుత్తమ పదవిని అధిష్టించిన
మొదటి దాక్షిణాత్యుడివై
ఒకే ఒక్క తెలుగు వాడిగా
రాజకీయ పుటల్లో లిఖించబడి
పి.వి గా ప్రసిధ్ధి గాంచి
రచయితగా రాణించి
బహుభాషావేత్తకోవిధునిగా వెలుగొంది
భారత ఆర్థక వ్యవస్థలో
విప్లవాత్మక సంస్కరణలు చేసి
విశిష్ట ఘనత సాధించిన
లోపలి మనిషి నవల ద్వార
ఎందరో మహానుభావుల
ఆత్మావలోకనం గావించి
అతిరధ మహారథుల చేత
మన్ననలందుకున్న
తెలుగు తేజమా…
నీకివే మా శతకోటి
నమసుమాంజలిలు….!!
డా.తాళ్ళపల్లి యాకమ్మ, మహబూబాబాద్ జిల్లా, సెల్: 9704226681.