భారతావనికి తానొక వీరసైన్యమై
పునీత కాగడాలనందించిన ధీరుడు
ఢిల్లీఎర్రకోట మీద మువ్వన్నెల తెలుగు పతాకమై ప్రఖ్యాతిగాంచి..తెలుగు జాతికి స్ఫూర్తిదాయకుడై
విశ్వ వినీలాకాశంలో విహరించిన యదార్థ
వాధిగా అలుపెరుగని కార్యసాధకుడతడు.!
భాషల సరస్వతీ పుత్రుడై..సాహిత్యానికి
జ్వలితాక్షరుడై చిరకాలం గుర్తుండిపోయే
రచనలతో సాహిత్యాన్ని సుసంపన్నం చేసి
సంపూర్ణ కీర్తి ప్రతిష్ట పొందిన
మహా మనిషిగా చైతన్య శిఖరమతడు..!
దేదీప్యమాన కాంతులతో తరిగిపోని విజ్ఞాన సర్వస్వమతడు.నిక్షిప్తమై నిద్రాణమై ఉన్న ఆర్థిక
సంస్కరణలకు బీజం వేసి భరతదేశాన్ని
గాడిన పెట్టి సజీవ జాతి గౌరవాన్ని జాగృతంచేసి..
ముందుకు నడిపిన దేశబాంధవుడతడు .
సామాన్య స్థాయి నుండి అసమాన్యుడిగా
ఎదుగుతూ.. దేశాన్ని ప్రగతిపథంలో
నడిపించిన ధీరకృషీవలుడు..
రాజకీయ చతురతతో అమూల్యమైన
సేవలనందించిన పీవీ తనదైన ముద్ర వేసుకున్న.. దురంధరుడిగా విశ్వానికి చిరస్మరణీయుడు.
మహావృక్షం క్రింద జనవాహిని కాపాడిన
పీవీకి ఇప్పుడు యావత్తు భారతావని ఒకటై
నిండైన జననీరాజనాలు అందిస్తున్నారు..!
కొలిపాక శ్రీనివాస్, వరంగల్ రూరల్ జిల్లా, చరవాణి:9866514972