అమ్మా నాన్న లు ప్రాణం పోస్తే
ఆ ప్రాణ బీజానికి విలువలు నేర్పి
ఒక పరిపూర్ణ మహా వృక్షంగా చేసేది గురువు
అందుకే గురువంటే మనిషి మాత్రమే కాదు
మానవ రూపంలో ఉన్న దైవం
ఆ దైవ రూపుడి జన్మదినన్నే మనం ఈ రోజు
గురుపూజోత్సవంగా జరుపుకుంటూన్నాం
ఆచార్యుడు, రాయబారి,రాష్ట్రపతి
ఇలాచెప్పుకుంటు పోతే ఏ పదవి చేపట్టిన
ఆ పదవికి వన్నె తెచ్చే వ్యక్తే మన
“డా.సర్వేపల్లి రాధాకృష్ణన్”
ఉపాద్యాయులలో ఉత్తముడిగా వెలుగొంది
విద్యా వ్యవస్థకే గర్వాంగా నిలిచి
ఉపాధ్యాయ వృత్తి నుండి ఉపరాష్ట్రపతి
రాష్ట్రపతి పదవిని అధిరోహించి
ఉపాధ్యాయ వృతిలోనే ఆనందం పొంది
ఓర్పుకి,సహనానికి మారుపేరుగా నిలిచి
నేర్పు,నైపుణ్యం తో బోధన చేసి
గొప్ప విద్యావంతుడిగా,తత్వవేత్తగా వెలిగి
గౌరవ పురస్కారం భారతరత్న పొంది
ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయంలో గౌరవం పొంది
తరాలు మరి ఆ గురువు స్థానం మారకుండా
పూజ్యుడిగా మన్ననలు అందుకున్న మీ జీవితం
అందరికి స్ఫూర్తి దాయకం.
-టి.సంయుక్తాకృష్ణమూర్తి, కరీమబాద్, వరంగల్ జిల్లా