ముగిసింది
ఇరవై…ఇరవై..
ఓ భయానక వత్సరం
చరిత్ర కందని,చిత్రమైన
అనుభవాలని
రాబోయే కొన్ని శతాబ్దాలపాటు
గుర్తుండేలా చేసినా
సంవత్సరం ఇరవై ఇరవై
మూగబోయిన బడిగంటలు
దర్శనమివ్వలేని దేవుళ్లు
సందడి లేక
బోసిపోయిన ఉద్యానవనాలు
బంధుమిత్రుల ఆత్మీయ
ఆలింగనలు లేవు …
వత్సరమంతా
నిశివడిలో నిదురించిన
ప్రపంచానికి,
చిరుఆశలు రేపుతూ
వజ్రకాంతులతో హిమబిందువు
పచ్చగడ్డిపై మెరుస్తూ
భవిష్యత్తుపై ఆశలని
చిగురింప చేసింది
భయాలని దూరంచేస్తూ
నిశినుండి వెలుగువైపు
ఆహ్వానిస్తూ
నూతన సంవత్సరానికి
స్వాగతం పలుకుదాం
పీ.వి.యస్. కృష్ణ కుమారి