విజ్ఞానఖని అయిన వేదభూమి మనది
మహర్షి ప్రోక్తమైన శాస్త్ర సంప్రదాయాలు మనవి
భారతంబు జనించిన భారతావని యిది
రామాయణోద్భవ నీతి మనది
అందుకే
మన విజ్ఞాన శాస్త్రములు చూసి వెన్నులో వణుకు పుట్టి
సిరిసంపదలను చూసి కన్ను కుట్టి
దండయాత్రలు చేసి దోచుకొనెనుకొందరు
ధరణి పతులై దండుకొనెనింకొందరు
దేవస్థలములు కూలదోసను కొందరు
హిందువులను హింసించెను మరికొందరు
మానవత్వం చాటున మత మార్పిడులు చేసెను కొందరు
విజ్ఞానఖని అయిన విద్యా వ్యవస్థను నాశనం చేసెనింకొందరు
ఎవరెన్ని కుట్రలు పన్నినా..
ఎంతగా హైందవ జాతిని భంగపరిచినా..
కింద పడిన కెరటం వలే ఉప్పొంగుతూనే ఉన్నది
తన పైన పడిన ముద్రను చెరిపివేస్తున్నది
ఎందుకంటే
ఇది శ్రీరాముడు ఏలిన పుణ్యభూమి
శ్రీకృష్ణుడు గీతను తెలిపిన కర్మభూమి
భావి కాలానికి ఇదే మార్గదర్శకమైన గురు భూమి
వేదాంతం శరత్ చంద్ర, తెలుగు ఉపాధ్యాయుడు, గద్వాల్