ఓటుకు నోటంట!! అవ్వ- ఎంత సిగ్గుచేటు…
ప్రజాస్వామ్యంలో పాలక ప్రతినిధులను ఎన్నుకునే హక్కే “ఓటు”
ఎందరో త్యాగధనులు ప్రాణాలర్పించి మనకు స్వాతంత్ర్యం తేస్తే-
ఎందరో మేధావులు మనకంటూ –
ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రాసి…
మన దేశాన్ని గణతంత్ర దేశంగా…
సర్వసత్తాకత ఆపాదించి, మనందరికీ హక్కులను ఇస్తే…
ఐదేళ్లకొకసారి మన బాధ్యతగా సర్వసమర్థుణ్ణి మన ప్రతినిధిగా ఎన్నుకోమంటే- ఇదా! ఇదా మనం చేసేది??
అభ్యర్థి పూర్వాపరాలు చూసిచూడనట్టుండి-
కాసిని నోట్లకు…మన ఓట్లను అమ్ముకుంటున్నామా??
ఆ నోట్లు..ఆకలిచావులు ఆపుతాయా??
మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తాయా??
ఆడబిడ్డలను కీచలకుల పాలుగాకుండ ఆపుతాయా??
రైతుల ఆత్మహత్యలు ఆపుతాయా??
ఎవరో దాకా ఎందుకు?? మరో ఐదేళ్లు నీకే కష్టం రాకుండా కాపుగాస్తాయా??
ఈ ప్రశ్నలన్నిటికి నీ దగ్గర జవాబుంటే-
ఆ జవాబు నీకు సమంజసంగా అనిపిస్తే ….
అమ్ముకో నీ హక్కును …సిగ్గులేకుండా!!
లేకపోతే- ఈసారి కొనుక్కుంటానని వచ్చినవాడిని కాలరుపట్టి రోడ్డుకు ఈడ్చిపారేయ్!!
నీ ఓటుతో మార్పుకు నాంది పలుకు!!
శ్రీ సుధ కొలచన, హైదరాబాద్