ఇందులో కొల్లాపూర్ ప్రభుత్వ బాలుర వసతి గృహ అధికారి పసుల సత్యనారాయణ యాదవ్ నాగర్ కర్నూల్ జిల్లా టీఎన్జీవో సంఘానికి అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ మామిళ్ల రాజేందర్ ఆయనకు అందచేశారు.
హైదరాబాద్ నాంపల్లి లో టీఎన్జీవో భవన్ ఈ మేరకు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సత్యనారాయణ యాదవ్ కు లేఖను అందచేశారు. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించినందుకు సత్యనారాయణ యాదవ్ రాష్ట్ర కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం, ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు.