28.7 C
Hyderabad
April 20, 2024 03: 50 AM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూలు జిల్లా టీఎన్జీవో సంఘానికి కొత్త కమిటీ

satyanarayana yadv

ఇందులో కొల్లాపూర్ ప్రభుత్వ బాలుర వసతి గృహ అధికారి పసుల సత్యనారాయణ యాదవ్ నాగర్ కర్నూల్ జిల్లా టీఎన్జీవో సంఘానికి అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ మామిళ్ల రాజేందర్ ఆయనకు అందచేశారు.

హైదరాబాద్ నాంపల్లి లో టీఎన్జీవో భవన్ ఈ మేరకు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సత్యనారాయణ యాదవ్ కు లేఖను అందచేశారు. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించినందుకు సత్యనారాయణ యాదవ్ రాష్ట్ర కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం, ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు.

Related posts

తెలంగాణలో చిన్నారుల వరుస కిడ్నాప్ లు: నేడు మరొకటి

Satyam NEWS

మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది దుర్మరణం

Bhavani

యువతను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించిన డా.కొత్తపల్లి శ్రీనివాస్

Satyam NEWS

Leave a Comment