రోహింగ్యాలను రక్షించాలని మయన్మార్ను అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది.దేశంలో వారి పై జరుగుతున్నా దాడులను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.ముస్లిం రోహింగ్యా ప్రజల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇవాళ మయన్మార్ దేశాన్ని ఆదేశించింది. అలాగే దేశంలో రోహింగ్యాలపై జరిగిన నేరాలకు సంబందించిన రుజువులను భద్రపరిచి, నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉన్నత కోర్టు మయన్మార్ను ఆదేశించింది. అయితే మయన్మార్లో 2017 సైనిక అణిచివేత తరువాత 7,30,000 మందికి పైగా రోహింగ్యాలు ఆ దేశాన్ని విడిచి పారిపోయారు.
previous post