కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని జుక్కల్ గురుకుల పాఠశాల ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ సునీత ను ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు గురిచేయడం దారుణమని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ అన్నారు. గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న నర్సస్ అందరికి తగిన రక్షణ కల్పిస్తూ, అందుకు కావలసిన జాగ్రత్తలు వెంటనే ప్రభుత్వం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటనను సత్యం న్యూస్ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
లేకపోతే రాష్ట్రంలో పనిచేస్తున్న నర్సస్ అందరూ తమ విధులను బహిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతారని ఆయన తెలిపారు. ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతునప్పటికి భయంతో బాధితులు చెపుకోకపోవడం వలన వెలుగులోనికి రావడం లేదని సునీత ధైర్యంగా చెప్పడం వలన ఈ సంఘటన వెలుగులోనికి వచ్చిందని ఆయన అన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి నిర్భయ చట్టం కింద అతడిని అరెస్టు చేయాలని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు చిలుపూరి వీరాచారి కోరారు.