మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడిపై ఎస్ సి ఎట్రాసిటీ కేసు నమోదు అయింది. యనమల రామకృష్ణుడితో బాటు మరో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పై కూడా ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు.
తన భర్తకు రెండోవ వివాహం చేసేందుకు ప్రయత్నించడంతో పాటుగా తనను బెదిరించారని దళిత యువతి మంజు ప్రియ ఫిర్యాదు చేసింది. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం కు ఫిర్యాదు అందడంతో ఆయన తదుపరి చర్యలకు ఆదేశించారు.
మంజు ప్రియ ఫిర్యాదుతో తుని నియోజకవర్గం తొండంగి పొలీసు స్టేషన్ లో ఏడుగురిపై (క్రైం. నెం: 230) ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పతో పాటుగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ దంపతులపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు కాగా వివరాలు ఇవి:
188,506,114,494 r/w 511, 34 IPC. 3(2)(va) sc st poa act, 51(b) bma-2005. A1.పిల్లి రాధకృష్ణ- భర్త, A2: పిల్లి సత్యనారాయణ – మావయ్య, A3.పిల్లి అనంతలక్ష్మీ – అత్త, మాజీ ఎమ్మెల్యే, కాకినాడ రూరల్, A4. యనమల కృష్ణుడు- అధ్యక్షుడు, టిడిపి, తుని నియోజకవర్గం, A5. యనమల రామకృష్ణుడు- మాజీ ఆర్దిక మంత్రి,
A6. నిమ్మకాయల చినరాజప్పల- మాజీ హోం మంత్రి, A7. సరిదే హరి-మాజీ ఎంపిటీసి, ఇంద్రపాలెం,కాకినాడ రూరల్. వివరాలు ఇలా ఉన్నాయి. 2011 లో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ కుమారుడు రాధాకృష్ణ ను మంజుప్రియ ప్రేమ వివాహం చేసుకున్నారు.
రెండు రోజుల క్రిందట మాజీ మంత్రి యనమల స్వగ్రామం లో రాధాకృష్ణ కు రెండోవ వివాహం జరిపించేందుకు యత్నం జరిగింది. ఈ పెళ్ళి కి పెద్దలుగా వివాహానికి మాజీ మంత్రులు యనమల, చినరాజప్ప తదితరులు హాజరయ్యారు. భాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు వివాహన్ని అడ్డుకున్నారు.