అమరవీరుల సాక్షిగా వర్గీకరణను సాధించుకుంటామని MRPS నాయకులు అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాదిగ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ అమరుల త్యాగాలు వృధా కావని, వారి స్పూర్తితో వర్గీకరణ సాధించుకుంటామని పలువురు నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ కాస్తాల శ్రావణ్ కుమార్,MSF నియోజకవర్గ ఇంచార్జీ నందిగామ వినోద్ మాదిగ,MSF పట్టణ నాయకులు మదాసు గోపి మాదిగ, MRPS మండల నాయకులు మేరిగ మట్టపల్లి, MSF నాయకులు వీరబాబు, ప్రవీణ్, క్రాంతి, శశి, మహేష్, యాకోబ్, నవీన్, నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.