సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బోప్ప పూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోనాపూర్ రామచంద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.
దుబ్బాక మండలం మున్సిపల్ కౌన్సిలర్స్ దళిత గిరిజన ప్రజా ప్రతినిధులు బాధిత కుటుంబాన్ని నేడు పరామర్శించారు.
గత 20 ఏళ్లుగా టిఆర్ఎస్ పార్టీ లో ఉంటూ ఉద్యమంలో తమతో కలిసి పని చేసిన రామచంద్రం జ్ఞాపకాలను వారు స్మరించుకున్నారు.
ఆయన కుటుంబానికి తక్షణ సాయంగా 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో దళిత గిరిజన ప్రజా ప్రతినిధుల ఫోరం అధ్యక్షుడు గుండ శంకర్, మండల ఉపాధ్యక్షుడు అస్క రవి, సభ్యులు ఆస యాదగిరి, ఆస స్వామి, తౌడ శ్రీనివాస్, బత్తుల స్వామి, బండమీది బాలమణి, మల్లయ్య ఉమ్మడి జిల్లా మాలమహానాడు అధ్యక్షుడు రాములు, నగరం మాజీ సర్పంచ్ జీడిపల్లి రవి, వనం రమేష్ డైరెక్టర్ వనం అశోక్, రామక్కపేట ఎంపిటిసి సంఘం శోభ స్వామి, నిమ్మ రజిత, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.