38.2 C
Hyderabad
April 25, 2024 14: 46 PM
Slider తూర్పుగోదావరి

మరో తెలుగు దేశం నాయకుడిపై అట్రాసిటీ కేసు

#JyotulaNaveen

తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కాకినాడ పార్లమెంట్ టిడిపి ఇంఛార్జ్ జ్యోతుల నవీన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు అయింది.

జగ్గంపేట – కాకినాడ రోడ్డు విస్తరణ పనుల్లో జగ్గంపేట శివారు గెద్దపేట రామాలయం వద్ద రెండు షాపులు కూలిపోయాయి.

షాపు యజమానులు వచ్చి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే షాపులు నేలకూలాయని నవీన్ కు చెప్పారు. నవీన్ సంఘటనా స్థలానికి చేరుకుని షాపు యజమానులతో మాట్లాడుతుండగా అక్కడకి సబ్ కాంట్రాక్టర్ వచ్చాడు.

ఆ సమయంలో సబ్ కాంట్రాక్టర్ కు నవీన్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత సబ్ కాంట్రాక్టర్ ఫిర్యాదుతో నవీన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు ను జగ్గంపేట పోలీసులు నమోదు చేశారు.

Related posts

దేశ రాజధానిలో సుదీర్ఘ పోరాట రైతులకు రెడ్ సెల్యూట్

Satyam NEWS

“హిందూ” అనేది మతం కాదు…సనాతన భారతదేశ వైదిక వ్యవస్థ…!

Satyam NEWS

మేడి పట్టిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

Leave a Comment