తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కాకినాడ పార్లమెంట్ టిడిపి ఇంఛార్జ్ జ్యోతుల నవీన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు అయింది.
జగ్గంపేట – కాకినాడ రోడ్డు విస్తరణ పనుల్లో జగ్గంపేట శివారు గెద్దపేట రామాలయం వద్ద రెండు షాపులు కూలిపోయాయి.
షాపు యజమానులు వచ్చి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే షాపులు నేలకూలాయని నవీన్ కు చెప్పారు. నవీన్ సంఘటనా స్థలానికి చేరుకుని షాపు యజమానులతో మాట్లాడుతుండగా అక్కడకి సబ్ కాంట్రాక్టర్ వచ్చాడు.
ఆ సమయంలో సబ్ కాంట్రాక్టర్ కు నవీన్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత సబ్ కాంట్రాక్టర్ ఫిర్యాదుతో నవీన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు ను జగ్గంపేట పోలీసులు నమోదు చేశారు.