విజయనగరం జిల్లాలో ఎస్సి, ఎస్టి అత్యాచార కేసులకు సంబంధించి, త్వరగా దర్యాప్తును పూర్తిచేయాలని జిల్లా రెవెన్యూ శాఖ అధికారి గణపతిరావు…పోలీసు శాఖ సిబ్బంది ని ఆదేశించారు.
ఈ మేరకు తన ఛాంబర్ జరిగిన సమీక్ష సమావేశం జరిగింది. నమోదైన కేసులకు సంబంధించి వారికి పరిహారం ఇప్పించాలని కోరారు. ఈ కేసులకు సంబంధించి, వివిధ విభాగాల డిఎస్పిలతో తన ఛాంబర్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న పెండింగ్ కేసులు, వాటలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినవి, ఛార్జిషీట్ ఫైల్ చేసినవాటిపై చర్చించారు.
వివిధ దశల్లో అందించిన పరిహారం గురించి చర్చించారు. కేసు నమోదు చేసిన వెంటనే బాధితులకు తొలివిడత పరిహారాన్ని అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్సి ఎస్టి సెల్ డిఎస్పి శ్రీనివాస్, ట్రాఫిక్ డిఎస్పి మోహనరావు, దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పి త్రినాధ్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.