మతం మారిన వారికి ఎస్ సి అభివృద్ధి కోసం నిర్దేశించిన పథకాలు వర్తించవని కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ సహాయ మంత్రి ఎ.నారాయణ స్వామి తెలిపారు.
వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం చెప్పారు.
ఎస్ సిల సంక్షేమం కోసం నిర్దేశించిన పథకాలను క్రైస్తవం లోకి మారిన వారికి వర్తింప చేయవచ్చా అని ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం చెబుతూ 1977 ఆగస్టు 30న జారీ చేసిన 341 జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర పథకాలను మతం మారిన ఎస్ సి లకు వర్తింపచేస్తున్న విషయం కేంద్రానికి తెలుసా అని కూడా ఆయన ప్రశ్నించారు.
ఎస్ సి లకు నిర్దేశించిన పథకాలు కన్వర్టెడ్ క్రిష్టియన్లకు వర్తింప చేయడానికి వీల్లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.