28.7 C
Hyderabad
April 25, 2024 06: 12 AM
Slider శ్రీకాకుళం

మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ ఆక్రమించిన క్రిష్టియన్ మిషనరీ స్కూలు

#Srikakulam School

కరోనా లాక్ డౌన్ లో ఏం చేశారు? ఇదేం ప్రశ్న, మాకు ఇష్టం వచ్చిన పని చేసేశాం….ఇది చెప్పేది ఎవరో ఇంట్లో కూర్చున్న వాళ్లయితే సరేలే అని సర్దు కోవచ్చు. కానీ శ్రీకాకుళం నగర నడిబొడ్డున ఉన్న డగ్లస్ స్కూల్ వారు మాత్రం పక్క స్కూలు ప్లేగ్రౌండ్ లో దారి వేసేసుకున్నారు.

దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మకమైన పసగాడ సూర్యనారాయణ మున్సిపల్ హైస్కూల్ స్థలాన్ని సొంత చేసుకుని వారి  మైదానంలో క్రిష్టియన్ మిషనరీకి చెందిన డగ్లస్ స్కూలుకు దారి వేసేసుకుంది. లాక్ డౌన్ కదా అని ఇంట్లో ఉన్న వారికి ఈ విషయం లాక్ డౌన్ పూర్తి అయిన తర్వాత తెలిసింది. కరోనా లాక్ డౌన్ ను అదునుగా తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా పక్క స్కూలు మైదానంలో కొంత భాగాన్ని ఆక్రమించిన విషయం తెలుసుకొని స్థానికులు జిల్లా బిజెపి నాయకులకు చెప్పారు.

దాంతో బిజెపి నాయకులు స్కూలుకు వెళ్లి పరిశీలించి అధికారులకు సమాచారం ఇచ్చి పనులను ఆపించారు. భవిష్యత్తులో మళ్లీ ఈ విధమైన ప్రయత్నం చేస్తే అడ్డుకోవడానికి ఉద్యమించడం జరుగుతుందని బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి పూడి బాలాదిత్య హెచ్చరించారు.

Related posts

కుప్పంలో 18 లక్షల టన్నుల బంగారం

Satyam NEWS

పేలిన నాటు తుపాకి.. వేటగాడు మృతి

Satyam NEWS

ఫోటో ఉంది : 14పీహెచ్ : పువ్వాడ పొలిటికల్ లెజెండ్

Bhavani

Leave a Comment