శ్రీకాకుళం గ్రామీణ మండలం లో గల పెద్ద పాడు గ్రామం లోనే ప్రాథమిక పాఠశాల ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల పెద్దపాడు ఉన్నత పాఠశాలలో 2 గదుల మధ్య 170 నుంచి ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులు చదువుతున్నారు.
ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులు రోజు పెద్ద పాడు గ్రామం నుంచి జాతీయ రహదారి మీదుగా సుమారుగా ఒక కిలోమీటర్ ప్రయాణించి ఉన్నత పాఠశాల చేరుకుంటున్నారు. మధ్యలో ఎన్.హె 16 రహదారి మధ్యలో ఉండడంతో విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాణ భయంతో ఉన్నారు.
మండల శాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారులు, జిల్లా విద్యాశాఖ ప్రాజెక్టు చైర్మన్, జిల్లా కలెక్టర్ , ఈ పాఠశాల పై దృష్టి సారించి పెద్ద పాడు గ్రామం లోనే నూతన ప్రాథమిక పాఠశాలను నాడు నేడు కార్యక్రమం లో భాగంగా గ్రామంలోనే నిర్మించాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.