స్కూళ్లలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వైద్య కాలేజీలు మినహా రాష్ట్రంలోని విద్యా సంస్థలు అన్నింటిని తాత్కాలికంగా రేపటి నుంచి మూసివేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఆన్లైన్ లో క్లాసులు యథావిథిగా కొనసాగుతాయని ఆమె తెలిపారు.