ఓమైక్రాన్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. తెలంగాణలో ఈ నెల 8వ తేదీ నుంచి స్కూళ్లను మూసివేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పై ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం లోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 8 తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసిఆర్ ఆదేశం ఇచ్చారు. అనంతరం మళ్లీ నిర్వహించే సమావేశంలో తదుపరి నిర్ణయం తీసుకుంటారు.
previous post
next post