కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో హిమాచల్ ప్రదేశ్ లో స్కూళ్లు, కాలేజీలను ఈ నెల 25 వరకూ మూసేయాలని నిర్ణయించారు.
స్కూళ్లు, కాలేజీలు తెరిచిన నాటి నుంచి కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. ఈ నెల 2న తెరిచిన స్కూళ్లు, కాలేజీలు ఇతర విద్యాసంస్థలు అన్నీ మూసేయాలని రాష్ట్ర మంత్రి వర్గం మంగళవారంనాడు నిర్ణయం తీసుకున్నది.
మొత్తం 125 మంది ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు కరోనా పాజిటీవ్ గా తేలారు.
విద్యార్ధులకు వారి నుంచి తల్లిదండ్రులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఏర్పడటంతో రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలే మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నది.