39.2 C
Hyderabad
March 29, 2024 15: 43 PM
Slider హైదరాబాద్

అంబర్ పేట్ లో మన బస్తీ మన బడి కార్యక్రమం

మన బస్తి మనబడి కార్యక్రమంలో భాగంగా అంబర్ పెట్ డివిజన్ లోని పోలీస్ బాయ్స్ ప్రభుత్వ పాఠశాలలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్ పెట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు కృష్ణ గౌడ్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అంబర్పేట్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, మౌలిక వసతుల కొరకు సుమారుగా 2 కోట్ల 77 లక్షల రూపాయలు విద్యాలయాలకు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సిపిఎల్ లో గల పోలీస్ బాయ్స్ ప్రభుత్వ పాఠశాలకి, మరియు లకోటియా ప్రభుత్వ పాఠశాలకి కలిపి దాదాపు సుమారుగా 80 లక్షల రూపాయల తో విద్యాలయాల్లో మౌలిక వసతులు, ఆధునీకరణ, చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివో రోహిణి, విద్యా మండలి అధికారులు, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్ ప్రిన్సిపల్ మాధురి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ఉలిక్కిపడ్డ తెలంగాణ: బ్యాంకులో రూ.3 కోట్ల భారీ చోరీ

Satyam NEWS

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో రాత్రి కర్ఫ్యూ

Satyam NEWS

చంద్రబాబు అరెస్టు తీవ్రంగా ఖండించిన మచిలీపట్నం విద్యార్థులు

Bhavani

Leave a Comment