విదేశాల నుంచి వచ్చే వారు, మన దేశంలోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కోవిడ్ 19 స్క్రీనింగ్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఎంతో వేగంగా జరుగుతున్నది. నిన్న ఒక్క రోజులో ఎయిర్ పోర్టు హెల్త్ డెస్క్ 3517 మందికి కోవిడ్ స్క్రినింగ్ చేసింది. అదే విధంగా ఇప్పటి వరకు ఎయిర్ పోర్ట్ లో స్క్రినింగ్ హెల్త్ డెస్క్ ద్వారా 41102 మంది కి స్క్రినింగ్ పూర్తి చేశారు.
హైదరాబాద్ లోని గాంధీ, ఫీవర్ హాస్పిటల్స్ లో ఐసోలేషన్ వార్డులలో ఉన్న వారి సంఖ్య 261 కి చేరింది. మొత్తం 493 మంది ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఇంట్లోనే ఐసోలెట్ అయి ఉన్నారు. ఇప్పటి వరకు గాంధీ ఆసుపత్రిలో 261 మందికి టెస్టులు చేయగా టెస్టులు చేసిన వారిలో 239 మందికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. తెలంగాణ లో ఇప్పటి వరకూ పాజిటీవ్ వచ్చిన కేసు ఒక్కటి మాత్రమే. మరో 11 ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.