ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణకు అడుగు ముందుకు వేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ గవర్నర్ తో భేటీ అయ్యారు.
బుధవారం ఉదయం రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ఆయన కలిసిఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత, ఎన్నికలపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై వివరించారు.
దాదాపు 40 నిమిషాల పాటు వారిద్దరి సమావేశం కొనసాగింది. సమావేశం ముగిసిన తర్వాత రమేశ్ కుమార్ నేరుగా తన కార్యాలయానికి వెళ్లారు.
ఈరోజు సాయంత్రం జిల్లా అధికారులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్లో కీలక ప్రకటన చేసే అవకాశముంది.