39.2 C
Hyderabad
April 25, 2024 17: 06 PM
Slider ముఖ్యంశాలు

స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్ తో ఎస్ఈసీ భేటీ

#APGovernor

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణకు అడుగు ముందుకు వేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ గవర్నర్ తో భేటీ అయ్యారు.

బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఆయన కలిసిఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత, ఎన్నికలపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై వివరించారు.

దాదాపు 40 నిమిషాల పాటు వారిద్దరి సమావేశం కొనసాగింది. సమావేశం ముగిసిన తర్వాత రమేశ్‌ కుమార్‌ నేరుగా తన కార్యాలయానికి వెళ్లారు.

ఈరోజు సాయంత్రం జిల్లా అధికారులతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక ప్రకటన చేసే అవకాశముంది.

Related posts

అన్నమయ్య జన్మస్థలి తాళ్ళపాక లో వార్షిక బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ కు రైల్వే లైన్ కావాలి

Satyam NEWS

పోలవరం పూర్తి కావడం కష్టo

Murali Krishna

Leave a Comment