27.7 C
Hyderabad
April 26, 2024 03: 11 AM
Slider విజయనగరం

ఉత్త‌రాంధ్ర‌లో ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ప‌ర్య‌ట‌న‌

#Nimmagadda

ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్ రెండు రోజుల పాటు ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించునున్నారు. వ‌చ్చే నెల‌లో పంచాయితీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి జిల్లా అధి్కారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించునున్నారు.

ఈ మేర‌కు ఫిబ్ర‌వ‌రి 1,2 తేదీల‌లో ఎన్నిక‌ల సంఘం క‌మీష‌న‌ర్ ప‌ర్య‌ట‌న ఖ‌రారు చేస్తూ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మీష‌న్..మూడు జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు అధికారికంగా లెట‌ర్లు పంపింది. ఫిబ్ర‌వ‌రి 1 ఇండిగో ఫ్లైట్ లో  విజ‌య‌వాడ నుంచీ విశాఖ‌కు చేరుకుంటున్నారు.

అక్క‌డే మ‌ధ్యాహ్నం  భోజనం చేసి రోడ్డు మీదుగా శ్రీకాకుళం కు చేర‌కుంటున్నారు. ఆ జిల్లాలో  4.30 నుంచీ 5.30 వ‌ర‌కు జిల్లా క‌లెక్ట‌ర్,ఎస్పీ ,డీఐజీతో మీటింగ్ జ‌రుగుతుంది. అనంతరం విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చేరుకుని ఆ రోజు రాత్రి  ఏడుగంట‌ల నుంచీ 8 గంట‌ల‌కు  వ‌ర‌కు జిల్లా  క‌లెక్ట‌ర్,ఎస్పీ, సీఈఓల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తారు.

డిన్న‌ర్ విజ‌య‌న‌గ‌రంలో డిన్న‌ర్ చేసి ఆ రాత్రి విశాఖ‌కు చేరుకుని అక్క‌డే బ‌స చేస్తారు. ఆ మ‌ర్నాడు విశాఖ ప‌ట్నంలో జిల్లా క‌లెక్ట‌ర్,ఎస్పీల‌తో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌,ఏర్పాట్లపై చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ స‌మీక్ష నిర్వ‌హిస్తారు.

అనంత‌రం రోడ్డు మీదుగా కాకినాడ‌కు చేరుకుని అక్క‌డే లంచ్ చేసిన అనంత‌రం 1.30 నుంచీ 2.30 వ‌ర‌కు తూర్పుగోదావ‌రి జిల్లా క‌లెక్ట‌ర్,ఎస్పీల‌తో స‌మీక్ష నిర్వ‌హిస్తారు. అక్క‌డ నుంచీ రోడ్డు మార్గం మీదుగా ఏలూరుకు చేరుకుని రాత్రి 7 గంట‌ల నుంచీ 8 గంట‌ల‌కు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా అధికారుల‌తో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్షా సమావేశం నిర్వ‌హించి…..ఏలూరులో డిన్న‌ర్ చేసి ఆదే రోజు రాత్రి విజ‌య‌వాడ చేరుకుంటారు.

Related posts

రోజా గన్ మెన్ కు కరోనా పాజిటీవ్

Satyam NEWS

పేరు పిచ్చితో అంబేద్కర్ ను అవమానించిన జగన్ రెడ్డి

Satyam NEWS

Sale Diabetes Cures Home Remedies Herb For Blood Sugar How To Get Sugar Levels Down Fast

Bhavani

Leave a Comment