కృష్ణాజిల్లా అవనిగడ్డ లోని మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు దర్శించుకున్నారు.
ఆలయ ప్రధాన అర్చకులు పవన్ కుమార్ శర్మ ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్థానిక సంస్థలు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన నేపథ్యంలో నిమ్మగడ్డ దేవాలయాల సందర్శన ప్రాధాన్యత సందర్శించుకుంది.
స్వామివారి నాగ పుట్టలో పలు పోసిన ఆయన మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయంలో రుద్రాభిషేకం చేసి, ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వాదాలు అందచేశారు.
అనంతరం స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. అదే విధంగా పెద కళ్ళేపల్లిలో వేంచేసియున్న శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారిని కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ దర్శించుకున్నారు.
అక్కడ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేయించుకున్నారు. దివిసీమలోని మోపిదేవి, పెదకళ్ళేపల్లి తో బాటు శ్రీకాకుళం, మొవ్వ గ్రామాల్లో ఉన్న దేవాలయాలను కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సందర్శించారు.