కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం 8 గంటలకు వేణు గానాలంకారంలో కోదండ రామ స్వామివారు అభయమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహనసేవ నిర్వహించారు.
అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం నిర్వహించ నున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేశారు.
రాత్రి 8 గంటలకు స్వామివారు హంస వాహనంపై దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో మురళీధర్, సూపరింటెండెంట్లు వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయులు ఇతర అధికారులు పాల్గొన్నారు.