34.2 C
Hyderabad
April 19, 2024 21: 23 PM
Slider వరంగల్

ములుగు జిల్లాలో రెండో దశ కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం

#MuluguDist

ములుగు జిల్లాలో రెండో దశ కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అప్పయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

జనవరి 19న వాక్సినేషన్ తీసుకున్న వాళ్ళందరూ  రెండవ డోసు తీసుకోవాలని ఆయన కోరారు. ఇందుకోసం జిల్లాలోని 16 కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.

జిల్లాలో ఐదు కేంద్రాల్లో 160 మంది హెల్త్ వర్కర్స్ తొలి దశ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉండగా 112 మంది  తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ఫస్ట్ డోసు ఎక్కడైతే తీసుకున్నారో ఆ కేంద్రాల్లోకి వెళ్లి  రెండోవ డోసు వాక్సినేషన్ తీసుకోవాలని ఆయన కోరారు.

జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్, ఏటూరునాగారం వెంకటాపురం సామాజిక ఆరోగ్య  కేంద్రాలలో రెండో దశ వ్యాక్సిన్ అందచేస్తున్నట్లు తెలిపారు.

కె మహేందర్ గౌడ్, సత్యం న్యూస్

Related posts

శెభాష్ పోలీస్: బయట తలుపువేసి లోపల మందు సప్లయ్

Satyam NEWS

సీఎం జగన్‌తో భేటీ అయిన సోమేశ్ కుమార్

Satyam NEWS

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

Murali Krishna

Leave a Comment